సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్ రతన్

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజీవ్‌ రతన్ ప్రస్తుతం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొనసాగుతున్నారు. ఉదయం ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

రాజీవ్ రతన్ హఠాన్మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన విశిష్టమైన సేవలను అందించారన్నారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదన్నారు. రాజీవ్ రతన్ మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated On 8 April 2024 11:15 PM GMT
Yagnik

Yagnik

Next Story