మేడ్చల్(Medchal)-మల్కాజ్‌గిరి(Malkajgiri) జిల్లా దుండిగల్ మండలం మల్లంపేట గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్‌ 295లో 4.14 ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ భూమి వి.మనోహర్‌రావుతో పాటుగా మరికొందరిది! వారంతా గత 16 సంవత్సరాలుగా ఇక్కడ ఆవుల పెంపకం చేస్తున్నారు.

మేడ్చల్(Medchal)-మల్కాజ్‌గిరి(Malkajgiri) జిల్లా దుండిగల్(Dundigal) మండలం మల్లంపేట గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్‌ 295లో 4.14 ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ భూమి వి.మనోహర్‌రావుతో పాటుగా మరికొందరిది! వారంతా గత 16 సంవత్సరాలుగా ఇక్కడ ఆవుల పెంపకం చేస్తున్నారు. ఈ భూమి మీద కన్నేసిన ఇంటూరి రమేశ్‌(Inturi Ramesh), ఇంటూరి రాజేశ్‌లు(Inturi Rajesh) కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. తమ అనుచరులతో కలిసి రోజూ భూ యజమానులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సివిల్‌ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదని, బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని హైకోర్టు(High Court) ఆదేశించినప్పటికీ మేడ్చల్ డీసీపీతో పాటు దుండిగల్ పోలీసులు కూడా కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారు. వారు కూడా బాధితులను బెదిరిస్తున్నారు. కబ్జాదారుల కొమ్ము కాస్తున్న డీసీపీ, ఇతర పోలీసు సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని, తమ భూమితో పాటు తమకు రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు బాధితులు.

Updated On 27 March 2024 6:01 AM GMT
Ehatv

Ehatv

Next Story