ఫిర్జాదిగూడ శ్రీ చైతన్య కాలేజీలో (Srichaithanya College) ఇంటర్ ఫస్టియర్‌ చదువుతున్న కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్ల గ్రామానికి చెందిన వర్ష (Varsha) నిన్న ఆత్మహత్యకు (Sucide) పాల్పడింది. వర్ష మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి (Gandhi Hospital) తరలించారు

ఫిర్జాదిగూడ శ్రీ చైతన్య కాలేజీలో (Srichaithanya College) ఇంటర్ ఫస్టియర్‌ చదువుతున్న కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్ల గ్రామానికి చెందిన వర్ష (Varsha) నిన్న ఆత్మహత్యకు (Sucide) పాల్పడింది. వర్ష మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి (Gandhi Hospital) తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి జూపాల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) గాంధీ ఆస్పత్రికి వెళ్లి వర్ష బౌతికకాయానికి నివాళులర్పించారు. వర్ష తల్లిదండ్రులు బీరయ్య - సాయిలీలను పరామర్శించి, ధైర్యం చెప్పారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విద్యార్థిని మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మంత్రి ఆరా తీశారు. పోలీసులను కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Updated On 29 Dec 2023 4:08 AM GMT
Ehatv

Ehatv

Next Story