తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

వ‌చ్చేవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజ‌క‌వ‌ర్గానికి 3500 ఇందిర‌మ్మ ఇండ్లు ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తామ‌ని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్ర‌క‌టించారు. శుక్ర‌వారం నాడు పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలోని కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో మంత్రిగారు మాట్లాడుతూ పేదవారి ప్రభుత్వం కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని ఈ రోజుతో 15 నెలలు అయ్యింద‌ని గ‌త ప్ర‌భుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్దిక ప‌రిస్ధితి అస్త‌వ్య‌స్ధంగా త‌యారైంద‌ని అయినా కూడా తెలంగాణ ప్ర‌జానీకానికి ఎన్నిక‌ల‌లో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టి అమ‌లు చేసుకుంటూ ముందుకెళ్తున్నామ‌న్నారు.అర్హులైన వారికి అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం,రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు బాగోలేని కారణంగా తులం బంగారం లేటవుతుంది.ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అరాచకం సృష్టించింది. వాటన్నింటినీ గాడిన పెడుతూ అభివృద్ధి, సంక్షేమం చేపడుతున్నాం.ఎక్కడ తగ్గకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం.పేదవారి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్త శుద్దితో పని చేస్తోంది.ఇచ్చిన ప్రతి మాటను..హామీని ఆలస్యమైనా నిలబెట్టుకుంటామ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు.

ehatv

ehatv

Next Story