✕
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఎయిర్ షో నిర్వహించనున్నారు.

x
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఈ ఎయిర్షో 30 నిమిషాల పాటు ఉంటుంది. ఎయిర్ షోలో భాగంగా వాయుసేన విమానాలు విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్బండ్తో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.

ehatv
Next Story