కల్వకుర్తి(Kalwakurthi) శివారు ప్రాంతమైన జేపీ నగర్‌(JP Nagar) తండా దగ్గర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు కన్నుమూశాడు.

కల్వకుర్తి(Kalwakurthi) శివారు ప్రాంతమైన జేపీ నగర్‌(JP Nagar) తండా దగ్గర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు కన్నుమూశాడు. నాగర్‌ కర్నూలు(Nagarkurnool) జిల్లా వంగూరు మండలానికి చెందిన తేడ్లపల్లి ప్రదీప్‌రావు(Pradeep Rao) హైదరాబాద్‌ నుంచి మోటార్‌సైకిల్‌పై తన గ్రామానికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఆ ప్రమాదంలో ప్రదీప్‌ అక్కడికక్కడే చనిపోయాడు. తమ బంధువుల వేడుకలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ప్రదీప్‌ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 4 April 2024 1:35 AM GMT
Ehatv

Ehatv

Next Story