అమరావతి బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ రాణా ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన బహిరంగ సభలో

అమరావతి బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ రాణా ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన బహిరంగ సభలో ‘15 సెకన్లు’ అంటూ చేసిన ప్రకటనపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. IPC సెక్షన్ 505 (2), 506, 171 -c, 171 – f, 171 – G కింద కేసు బుక్ చేశారు. విధుల్లో ఉన్న ఎన్నికల అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక సమావేశంలో ఆమె AIMIMని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఊహించని దుమారాన్ని రేపింది. 2012లో నిర్మల్‌లో అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ నవనీత్ కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆమె ఒవైసీ సోదరులకు 15 సెకన్ల సవాల్ విసిరారు. పోలీసులు కేవలం 15 సెకన్లు డ్యూటీ నుంచి పక్కకు తప్పుకుంటే ఒవైసీ సోదరులు ఎక్కడి నుంచి వచ్చారో.. తిరిగి ఎక్కడికి చేరుకున్నారో కూడా తెలియకుండా చేస్తామని నవనీత్ హెచ్చరించారు.

Updated On 11 May 2024 5:39 AM GMT
Yagnik

Yagnik

Next Story