ఓ వ్యక్తి భార్యపై(wife) అనుమానం పెంచుకున్నాడు. కుటుంబకలహాలతో రెండు నెలలుగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. భార్యను అత్యంత దారుణంగా నరికి చంపి(Murder) తల(Head), మొండెం(Body) వేరుచేశాడు. హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌(Abdullapurmet)లో ఈ ఘటన చోటుచేసుకుంది. వనస్థలిపురం పోలీసులు(Vanasthalipuram police) వెల్లడించిన వివరాల ప్రకారం..

ఓ వ్యక్తి భార్యపై(wife) అనుమానం పెంచుకున్నాడు. కుటుంబకలహాలతో రెండు నెలలుగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. భార్యను అత్యంత దారుణంగా నరికి చంపి(Murder) తల(Head), మొండెం(Body) వేరుచేశాడు. హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌(Abdullapurmet)లో ఈ ఘటన చోటుచేసుకుంది. వనస్థలిపురం పోలీసులు(Vanasthalipuram police) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్‌కు చెందిన విజయ్‌కుమార్(Vijay kumar), పుష్పవతి(Pushpa) దంపతులు. వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. గత రెండు నెలలుగా పుష్పవతి కూతురును తీసుకెళ్లి అబ్దుల్లాపూర్‌మెట్‌లో నివాసం ఉంటుంది. తన కుమారుడు, తల్లిదండ్రులతో కలిసి ఎల్బీనగర్‌లో విజయ్‌కుమార్‌ ఉంటున్నాడు. తరుచుగా భార్య, కూతురు దగ్గరకు వస్తూవెళ్లేవాడు.

ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న విజయ్‌కుమార్.. పుష్పవతిని ఎలాగైనా హతమార్చాలని ప్లాన్‌ వేశాడు. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ కాలనీకి(JNNUR colony) పక్కనే ప్రభుత్వం నిర్మించిన ఇళ్లలో తన సోదరికి ఇల్లు వచ్చిందని.. ఇంటిని శుభ్రం చేసి వద్దామని పుష్పవతి ఉంటున్న ఇంటికి వెళ్లాడు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత తన వెంట తెచ్చుకున్న పుష్పవతిని అతికిరాతకంగా పొడిచి చంపాడు. తల, మొండెం వేరుచేసి అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రిక తరలించారు. ఇదే విషయాన్ని పుష్పవతి తల్లిదండ్రులకు చెప్పినా వారు ఆమెను చూసేందుకు రాకపోవడం గమనార్హం. నిందితుడు విజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు.

Updated On 17 Jan 2024 4:22 AM GMT
Ehatv

Ehatv

Next Story