తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో అతి భారీ వర్షాలు పడుతాయని హైదారబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ(IMD)వెల్లడించింది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణశాఖ సూచించింది.

ehatv

ehatv

Next Story