భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(bhadradri kothagudem district) కేంద్రంలోని బూడిదగడ్డ(buidagadda) ప్రాంతంలో దారుణం జరిగింది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(bhadradri kothagudem district) కేంద్రంలోని బూడిదగడ్డ(buidagadda) ప్రాంతంలో దారుణం జరిగింది. తానులేకపోతే తల్లిని ఎవరూ చూసుకోరేమోనన్న ఆలోచనతో ఆమెను చంపేశాడో వ్యక్తి. తర్వాత ఆమె శవం పక్కనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బూడిదగడ్డలో నివసిస్తున్న 55 ఏళ్ల తుల్జా కుమారి(thulja kumari)కి కూతురు హారతి(Harathi), కొడుకు వినయ్‌కుమార్‌(vinay kumar) ఉన్నారు. పదేళ్ల కిందట భర్త చనిపోయాడు. కూతురు హారతి పెళ్లయింది. ఆమె అదే ప్రాంతంలో భర్త, ఇతర కుటుంబీకులతో ఉంటోంది. కొంతకాలం కిందట తుల్జా కుమారికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం ఆమె మందులు వాడుతున్నారు. గతంలో వినయ్‌కుమార్‌ అక్కడక్కడ పని చేసేవాడు. రెండేళ్ల నుంచి పని చేయడం లేదు. అప్పట్నుంచి తుల్జాకుమారి, వినయ్‌ కుమార్‌ను బంధువులు అంతో ఇంతో సాయం అందిస్తున్నారు. ఈ మధ్యనే వినయ్‌కుమార్‌ ఆరోగ్యం కూడా పాడయ్యింది. హైడ్రోసిల్‌కు గురైన వినయ్‌ కుమార్ హాస్పిటల్‌కు(hospital) వెళితే అలర్జీ ఉండటంతో ఇప్పట్లో శస్త్ర చికిత్స చేయడం కుదరదని, కొన్ని రోజులు ఆగాలని చెప్పారు. అప్పట్నుంచి వినయ్‌కుమార్‌ డీలా పడ్డాడు. ఇక తాను ఉండనని, తనకు బతకాలని లేదని ఫ్రెండ్స్‌తో చెప్పుకునేవాడు. మతి భ్రమించచడంతో తనలో తానే మాట్లాడుకునేవాడు. నాకేమైనా అయితే అమ్మ ఒంటరిది అయిపోతుందని, నేను లేకపోతే మా అమ్మకు తోడు ఎవరుంటారు అంటూ గొణుక్కునేవాడు.

అదే ఆలోచనలో ఉన్న వినయ్‌కుమార్‌ శుక్రవారం అర్ధరాత్రి దాటాక నిద్రిస్తున్న తల్లి తలపై ఇనుపరాడ్డుతో కొట్టి హత్య చేశాడు. ఆమె శవం పక్కనే దూలానికి తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురు హారతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ehatv

ehatv

Next Story