బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై జరిగిన దాడిని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై జరిగిన దాడిని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఇదే ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం అంటూ నిలదీశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్(Congress)లోకి చేర్చుకోవడంతో పాటు, వారినే ఉసిగొల్పి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని హరీశ్‌ అన్నారు. కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని, కౌశిక్‌రెడ్డికి(Kaushik Reddy)వెంటనే రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాళ్లు, గుడ్లు, టమాటాలతో మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఎమ్మెల్యే అరికపూడి గాంధీ(MLA Arekapudi Gandhi)మంది మార్బలంతో వెళ్లి దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నది స్పష్టంగా తెలుస్తున్నదని, ఇంటి మీదకు వస్తామని ప్రెస్ మీట్ లో ప్రకటించి, అనుచరులతో దాడి చేసినప్పటికీ నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీవ్రంగా విఫలమైందని తెలిపారు. పట్టపగలు ప్రజాప్రతినిధి మీద జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హరీశ్‌రావు అన్నారు.

ehatv

ehatv

Next Story