ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హేయమైన చర్య అని

ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హేయమైన చర్య అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుడు హరీశ్‌రావు (Harish Rao)అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. నేను పోలీసు కుటుంబం నుండి వచ్చిన. పోలీసుల కష్టాలు నాకు తెల్సు. ఇంట్లో భార్య, బిడ్డలు పడే బాధ నాకు తెలుసు అంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పోలీసుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని హరీశ్‌ ప్రశ్నించారు. వారి ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవడం లేదని నిలదీశారు. అధికారం లేకుంటే ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాటనా..? అని విమర్శించారు. భేషజాలు పక్కన పెట్టి.. టీజీఎస్పీ(TGSP) సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, 10 మందిని ఉద్యోగం నుండి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకొని, సస్పెండ్ చేసిన 39 మంది కానిస్టేబుళ్లను కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హరీశ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ehatv

ehatv

Next Story