చిత్తూరు జిల్లాలో(Chitoor) తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

చిత్తూరు జిల్లాలో(Chitoor) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లయిన అయిదు రోజులకే కొత్త పెళ్లి కొడుకు(Groom) ఊహించని విధంగా చనిపోయాడు. కర్నాటకలోని(Karnataka) వెంగసంద్రాకు చెందిన 28 ఏళ్ల కార్తీక్‌ చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కొల్లుపల్లికి చెందిన భవానితో పెళ్లి జరిగింది. పెళ్లయిన అయిదో రోజు కార్తీక్‌ తన భార్యను తీసుకుని అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ అతడు అనారోగ్యానికి గురయ్యాడు. భార్యను తీసుకుని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు క్లినిక్‌కు వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. కార్తీక్‌ గుండెపోటుతో చనిపోయి ఉంటాడని పలువురు అనుమానిస్తున్నారు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే కార్తీక్‌ చనిపోయాడని కుటుంబసభ్యులు అంటున్నారు. సకాలంలో వైద్యులు వైద్యం అందించలేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనాస్థతికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Eha Tv

Eha Tv

Next Story