గోషామ‌హ‌ల్‌ ఎమ్మెల్యే, బీజేపీ సీనియ‌ర్ నేత‌ రాజాసింగ్Raja Singh) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీఆర్ అంబేద్కర్ వర్దంతి కార్యక్రమంలో రాజాసింగ్ పాల్గొన్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పటికైనా తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ ఏలుతుందని ధీమా వ్యక్తం చేశారు.

గోషామ‌హ‌ల్‌ ఎమ్మెల్యే, బీజేపీ సీనియ‌ర్ నేత‌ రాజాసింగ్Raja Singh) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీఆర్ అంబేద్కర్ వర్దంతి కార్యక్రమంలో రాజాసింగ్ పాల్గొన్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పటికైనా తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ ఏలుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదన్నారు. ఒక్క ఏడాది మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటుందని.. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ చేసి వెళ్లిన అప్పులు తీర్చే క్రమంలో చతికిలపడుతుందని అన్నారు.

తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని రాజాసింగ్ అన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్‌నే తెలంగాణ ప్రజలు మార్చేశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాష్ట్రంలోని దళితులకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీకి 8 ఎమ్మెల్యే సీట్లను ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

Updated On 6 Dec 2023 5:11 AM GMT
Ehatv

Ehatv

Next Story