కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ అయినా అమలు చేసిందా.? అని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్ర‌శ్నించారు. యాదాద్రిలో జ‌రిగిన బీజేపీ విజ‌య సంక‌ల్ప యాత్ర‌లో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ..

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ అయినా అమలు చేసిందా.? అని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్ర‌శ్నించారు. యాదాద్రిలో జ‌రిగిన బీజేపీ విజ‌య సంక‌ల్ప యాత్ర‌లో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. జూటా గ్యారెంటీ లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమ‌ర్శించారు.

కేసీఆర్ నీళ్లు, నిధులు, నియమకాల పేరుతో తెలంగాణను దోచుకున్నాడని ఆరోపించారు. తెలంగాణలో ఈసారి బీజేపీ 10 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు రెండూ ఒక్కటేన‌న్నారు. 2014లో యూపీఏ కూటమిలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నదన్నారు. 2జీ, కోల్ స్కామ్ చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం లో ఉందన్నారు. మోదీ లేకపోతే జమ్మూకాశ్మీర్ తీవ్రవాదుల అడ్డా అయ్యేది.. ఇప్పుడు టూరిస్టుల అడ్డాగా మారిందన్నారు.

Updated On 20 Feb 2024 8:53 AM GMT
Yagnik

Yagnik

Next Story