తెలంగాణ రాష్ట్రం జోగులాంబ‌ గద్వాల జిల్లాలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. వివ‌రాళ్లోకెళితే.. జిల్లా కేంద్రంలోని ఇటిక్యాల మండలం మంగంపేట వద్ద చిన్నారులు నదిలో ఈతకు దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో నలుగురు మునిగిపోయారు. మృతి చెందిన పిల్ల‌ల‌ను అఫ్రీన్ (17), సమీర్ (8), రిహాన్ (15), నౌసీన్ (7) గా గుర్తించారు. ఈ ఘటనలో మృతిచెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావ‌డం విశేషం.

తెలంగాణ రాష్ట్రం జోగులాంబ‌ గద్వాల జిల్లాలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. వివ‌రాళ్లోకెళితే.. జిల్లా కేంద్రంలోని ఇటిక్యాల మండలం మంగంపేట వద్ద చిన్నారులు నదిలో ఈతకు దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో నలుగురు మునిగిపోయారు. మృతి చెందిన పిల్ల‌ల‌ను అఫ్రీన్ (17), సమీర్ (8), రిహాన్ (15), నౌసీన్ (7) గా గుర్తించారు. ఈ ఘటనలో మృతిచెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావ‌డం విశేషం. దీంతో కుటుంబ సభ్యుల క‌న్నీటి రోద‌న‌లు క‌లిచివేస్తున్నాయి. ఆలంపూర్ నియోజవకర్గంలోని ఇటిక్యాల మండలం మంగంపేట వ‌ద్ద‌నున్న‌ కృష్ణా నదిని చూసేందుకు 11 మంది ఆటోలో వెళ్లారు. అక్క‌డ నదిలో దిగిన చిన్నారులకు ఈత రాకపోవడంతో నీట మున‌గ‌డంతో ప్రాణాలు కోల్పోయారు. ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు నది వద్దకు చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు.

Updated On 5 Jun 2023 7:13 AM GMT
Ehatv

Ehatv

Next Story