నల్లగొండలో(Nalgonda) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) సంభవించింది. ఈ ప్రమాదంలో అయిదుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. రెండు కుటుంబాలకు చెందిన వారు ఒకే కారులో(Car) దైవ దర్శనాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మరో అయిదు నిమిషాల్లో ఇంటికి చేరుకునే సమయంలో వెనుక నుంచి ఓ లారీ(Lorry) ఢీకొట్టి పోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులతో పాటు అయిదుగురు చనిపోయారు.

నల్లగొండలో(Nalgonda) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) సంభవించింది. ఈ ప్రమాదంలో అయిదుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. రెండు కుటుంబాలకు చెందిన వారు ఒకే కారులో(Car) దైవ దర్శనాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మరో అయిదు నిమిషాల్లో ఇంటికి చేరుకునే సమయంలో వెనుక నుంచి ఓ లారీ(Lorry) ఢీకొట్టి పోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులతో పాటు అయిదుగురు చనిపోయారు. ఓ మహిళ తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. .
స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేశ్(32), ఆయన భార్య జ్యోతి (30), వీరి కుమార్తె రిషిత (6)లతోపాటు మహేశ్ తోడల్లుడు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు చెందిన భూమా మహేందర్ (32), ఆయన భార్య మాధవీ, వీరి కుమారుడు లియాన్సీ (2)లు కారులో ప్రయాణిస్తున్నారు. వీరంతా ఏపీలోని విజయవాడ, ఇతర ప్రాంతాల్లోని దైవ దర్శనాలకు వెళ్లి తిరిగి వస్తున్నారు. నందిపాడు కాలనీకి వస్తుండగా.. అద్దంకి నార్కట్ పల్లి ప్రధాన రహదారిపై ఆ కారును వెనుక నుంచి గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది. మహేశ్, జ్యోతి, రిషిత, భూమా మహేందర్, లియాన్సీలు అక్కడికక్కడే మరణించారు. మాధవి గాయాలతో బయటపడింది. మిర్యాలగూడ ప్రాంతీయ హాస్పిటల్‌లో ఆమెకు అత్యవసర చికిత్స అందించారు. ఆ తర్వాత ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ లారీ ఆచూకీ కోసం వెతుకుతున్నట్టు సమాచారం.

Updated On 29 Jan 2024 1:38 AM GMT
Ehatv

Ehatv

Next Story