వ‌రుస‌ రైలు ప్ర‌మాదాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. తాజాగా ఫలకునుమా ఎక్స్‌ప్రెస్‌(Falaknuma Express)లో మంటలు చెల‌రేగాయి. భువనగిరి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ లో మంటలు వ్యాపించిన‌ట్లు స‌మాచారం. పగిడిపల్లి బొమ్మాయి పల్లి మార్గంలో ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించాయని రైల్వే సిబ్బంది తెలిపింది. ప్రయాణికులను దించివేయడంతో ప్రాణనష్టం తప్పింది.

వ‌రుస‌ రైలు ప్ర‌మాదాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. తాజాగా ఫలకునుమా ఎక్స్‌ప్రెస్‌(Falaknuma Express)లో మంటలు చెల‌రేగాయి. భువనగిరి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ లో మంటలు వ్యాపించిన‌ట్లు స‌మాచారం. పగిడిపల్లి బొమ్మాయి పల్లి మార్గంలో ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించాయని రైల్వే సిబ్బంది తెలిపింది. ప్రయాణికులను దించివేయడంతో ప్రాణనష్టం తప్పింది. ఎస్-3, ఎస్-4, ఎస్-5, ఎస్-6 భోగీలకు పొగ, మంటలు వ్యాపించాయి. తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో మిగతా బోగీలకు మంటలు అంటుకుంటున్నాయి.

Updated On 7 July 2023 1:48 AM GMT
Ehatv

Ehatv

Next Story