భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(bhadradri kothagudem district) మణుగూరు మండలం(manugur mandal) పగిడేరు(Pagideru) గ్రామంలో విషాదం చోటు చేసుకుంది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(bhadradri kothagudem district) మణుగూరు మండలం(manugur mandal) పగిడేరు(Pagideru) గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ వృద్ధ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పగిడేరుకు చెందిన రామచంద్రయ్య(ramachandraiah)(80), భార్య సరోజనమ్మ(sarojanamma)(75)లు గ్రామంలోని ఎస్టీ కాలనీలో (st Colony)నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. కుమారులు మణుగూరు మండలంలోని గొల్లకొత్తూరు (golla kotturu)గ్రామంలో నివసిస్తున్నారు. వృద్ధ దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే ఆదివారం సాయంత్రం సమయంలో ఇంటి నుంచి బయటకి వెళ్లిన వృద్ధదంపతులు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో గ్రామస్తులు, కుటుంబసభ్యులు వెతికిని దొరకలేదు. చివరగా ఓ వ్యవసాయ బావి వద్ద వృద్ధ దంపతులు చెప్పులు, వస్తువులు లభ్యమయ్యాయి. బావిలో వెతికితే సరోజనమ్మ మృతదేహం లభ్యమైంది. రామచంద్రయ్య మృతదేహం కోసం గాలిస్తున్నారు. సరోజనమ్మ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఈ వృద్ధ దంపతుల ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story