వరంగల్‌లో శుక్రవారం ఉదయం భూమి కంపించింది. తెల్లవారుజామున 4.43 గంటలకు ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప‌ తీవ్రత

వరంగల్‌(Warangal)లో శుక్రవారం ఉదయం భూమి కంపించింది. తెల్లవారుజామున 4.43 గంటలకు ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలు(Richter Scale)పై భూకంప‌(Earthquake) తీవ్రత 3.6గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం(National Center for Seismology) వెల్లడించింది.వరంగల్‌కు తూర్పున 127 కిలోమీటర్ల దూరంలో.. 30 కిమీ లోతులో భూకంప కేంద్రం గుర్తించిన‌ట్లు తెలిపింది.

భూప్ర‌కంప‌న‌ల‌తో వరంగల్ వాసులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. ఏం జ‌రుగుతుందో తెలియక ప్ర‌జ‌లు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే స్వల్ప భూకంపం కావడంతో వెంటనే ఊపిరిపీల్చుకున్నారు. భూకంపం వ‌ల్ల ఎటువంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం వాటిల్ల‌లేద‌ని తెలుస్తోంది.

Updated On 24 Aug 2023 9:33 PM GMT
Yagnik

Yagnik

Next Story