ఐమాక్స్‌ థియేటర్‌(Imax), జలవిహార్‌లను(Jalavihar) ఎందుకు కూల్చివేయలేదని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌

హైదరాబాద్(Hyderabad) డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) నగరంలో చేపడుతున్న అనధికారిక నిర్మాణాల కూల్చివేతలపై కాంగ్రెస్(Congress) నాయకుడు, ఖైరతాబాద్(Khairathabad) ఎమ్మెల్యే దానం నాగేందర్(Dhanam nagendra) తన సొంత పార్టీపై విమర్శలు గుప్పించారు. హుస్సేన్‌సాగర్‌కు అడ్డంగా నిర్మించిన ప్రసాద్‌ ఐమాక్స్‌ థియేటర్‌(Imax), జలవిహార్‌లను(Jalavihar) ఎందుకు కూల్చివేయలేదని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదల ఇళ్లను కూల్చివేయడం సరికాదని, నిర్వాసితులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు. హైడ్రా ద్వారా కూల్చివేతల‌కు మార్కింగ్ పనులు హడావుడిగా జరుగుతున్నాయని.. అలాగే నిర్వాసితులకు సమీప ప్రాంతాల్లో ఇళ్లను త్వ‌ర‌గా నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం మూసీ నది ఒడ్డున ఉన్న ఆక్రమణల కూల్చివేతపై భారతీయ జనతా పార్టీ ఆదివారం తెలంగాణ ప్రభుత్వంపై దాడి చేసింది. హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా బీజేపీ ఒకట్రెండు రోజుల్లో ర్యాలీ చేపడుతుందని కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. "ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇల్లు కూల్చివేయడమా?" అని అడిగారు.

మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రసాద్ ఐమాక్స్, జలవిహార్‌లను ఎందుకు కూల్చివేయలేదని ప్రశ్నించారు. హైడ్రా నగరవ్యాప్తంగా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతపై మల్కాజిగిరి ఎంపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఈటల.. ఫార్మా సిటీ కోసం ప్రభుత్వం భూములు సేకరించినట్లుగా ఎందుకు భూములు సేకరించడం లేదు? ప్రజల ఇళ్లను ప్రభుత్వం తమ పూర్వీకుల ఆస్తిగా భావించి ఎందుకు నాశనం చేస్తోంది? అని ప్ర‌శ్నించారు.

Eha Tv

Eha Tv

Next Story