దీక్షా వేదికను మార్చుకోవాలంటూ చివరి నిమిషంలో ఢిల్లీ పోలీసులు ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చారు. రేపు జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ బిల్లుపై దీక్షను తలపెట్టారు ఎమ్మెల్సీ కవిత.

దీక్షా వేదికను మార్చుకోవాలంటూ చివరి నిమిషంలో ఢిల్లీ పోలీసులు ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చారు. రేపు జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ బిల్లుపై దీక్షను తలపెట్టారు ఎమ్మెల్సీ కవిత. అయితే అనూహ్యంగా ఆఖరు నిమిషంలో దీక్షకు ముందుస్తుగా తీసుకున్న అనుమతులను పోలీసులు రద్దు చేశారు. రెండు రోజుల ముందుగానే ఢిల్లీ చేరుకున్న కవిత.. జంతర్ మంతర్ దగ్గర ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రేపు జరుగబోయే దీక్షకు 18 రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. ఒకవైపు దీక్షకు ఏర్పాట్లు, మరోవైపు ప్రత్యేక ఆహ్వానితులను సమన్వయపరచడంలో తనమునకలైన కవితకు ఢిల్లీ పోలీసులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.

Updated On 9 March 2023 4:25 AM GMT
Ehatv

Ehatv

Next Story