మంచిర్యాల జిల్లా(Manchiryala District) నెన్నెల మండలంలో విషాదం నెలకొంది. ఓ జంట మధ్య ప్రేమ చిన్నతనంలోనే చిగురించింది. చిత్తపూర్‌ గ్రామానికిచెందిన భగవాన్‌(Bhagavan) (23), మామిడిగట్టు గ్రామానికి చెందిన సంగీత(sangeetha) (21) స్కూల్‌ డేస్‌లోనే ప్రేమించుకున్నారు. సంగీత డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. భగవాన్‌ డ్రైవింగ్‌ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. పాఠశాలలో చదువుకునే రోజుల నుంచే సంగీత, భగవాన్‌ మధ్య ప్రేమ చిగురించింది.

మంచిర్యాల జిల్లా(Manchiryala District) నెన్నెల మండలంలో విషాదం నెలకొంది. ఓ జంట మధ్య ప్రేమ చిన్నతనంలోనే చిగురించింది. చిత్తపూర్‌ గ్రామానికిచెందిన భగవాన్‌(Bhagavan) (23), మామిడిగట్టు గ్రామానికి చెందిన సంగీత(sangeetha) (21) స్కూల్‌ డేస్‌లోనే ప్రేమించుకున్నారు. సంగీత డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. భగవాన్‌ డ్రైవింగ్‌ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. పాఠశాలలో చదువుకునే రోజుల నుంచే సంగీత, భగవాన్‌ మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరిదీ ఒకే సామాజిక వర్గం కూడా కావడంతో పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అయితే ఇదే విషయాన్ని సంగీత తన ఇంట్లో చెప్పడంతో కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. ఇదే విషయంపై సంగీత ఇంట్లో కొంతకాలంగా గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే బుధవారం నాడు కూడా తల్లిదండ్రులతో సంగీతకు గొడవ జరిగింది. సంగీత అక్క కుమారుడు వియన్ష్‌కు భోజనం తినిపించాలని తల్లిదండ్రులు చెప్పినా చేయకపోవడంతో ఈ ఘర్షణ మరింత ముదిరింది. తల్లిదండ్రులు బయటకు వెళ్లాక సంగీత ఉరివేసుకొని(suicide) చనిపోయింది. విషయం తెలుసుకున్న తన ప్రేమికుడు భగవాన్‌ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

బుధవారం ఉదయం సంగీతతో గొడవ జరిగాక వ్యవసాయ పనుల కోసం పొలం వద్దకు తల్లిదండ్రులు వెళ్లిపోయారు. ఆ తర్వాత సంగీత ఓ ఫోన్‌ మాట్లాడి ఇంట్లోనే ఉన్న దూలానికి ఉరివేసుకొని చనిపోయింది. తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు సంగీత దూలానికి వేలాడుతూ కనిపించింది. ఆమెను కిందికి దించి ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని వెల్లడించారు. కుమురంభీం జిల్లా రేపల్లివాడకు వెళ్లి పత్తిలోడ్‌తో తిరిగి వస్తున్న భగవాన్‌కు విషయం తెలియడంతో మనస్తాపం చెందాడు. సంగీత చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. బెల్లంపల్లి మండలం బట్వాన్‌పల్లి శివారులో ఉన్న ఓ మామిడితోటలోకి వెళ్లి అప్పటికే తను కొనుగోలు చేసిన పురుగుల మందును తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భగవాన్‌ సోదరుడు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా అటెండ్‌ చేయకపోవడంతో గాలింపు చేపట్టారు. బట్వాన్‌పల్లి దారిలో డీసీఎం కనపడడంతో దగ్గర్లో ఉన్న మామిడితోటలో వెతకగా నోట్లో నుంచి నురుగులతో కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది.. భగవాన్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను చనిపోయాడని నిర్ధారించారు. ప్రేమ విఫలమైందని ఇరువురు ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. కన్నీరుమున్నీరుగా ఇద్దరి కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

Updated On 14 March 2024 2:13 AM GMT
Ehatv

Ehatv

Next Story