తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ తప్పక నెరవేర్చాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ తప్పక నెరవేర్చాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. నాగర్‌కర్నూల్‌(Nagar Kurnool)లోని సాయి గార్డెన్స్‌(Sai Gardens)లో జరిగిన సన్మాన సభలో సాంబశివరావు మాట్లాడుతూ.. ఏ రాజకీయ పార్టీకైనా ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయమని అభిప్రాయపడ్డారు.

అణగారిన వర్గాల వాణిని వినిపించేందుకు కాంగ్రెస్ పార్టీతో సీపీఐ(CPI) పొత్తు పెట్టుకుందని.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సీపీఐ రాజీపడదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంతోపాటు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అంకితభావంతో ఉన్నారని నాగ‌ర్ క‌ర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్‌రెడ్డి(MLA Rajesh Reddy), ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి(MLC Damodhar Reddy)లు స్పష్టం చేశారు.

Updated On 12 Jan 2024 8:18 AM GMT
Yagnik

Yagnik

Next Story