ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రకటనలు చూస్తుంటే ఆయన పిచ్చి పరాకాష్టకు చేరినట్టుగా అనిపిస్తుందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రకటనలు చూస్తుంటే ఆయన పిచ్చి పరాకాష్టకు చేరినట్టుగా అనిపిస్తుందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ పదవి కోసం తన కాళ్ళు పట్టుకున్నాడని కౌశిక్ రెడ్డి అనడం చూస్తే.. ఆయన మతి స్థిమితం కోల్పోయిందని చెప్పడానికి ఒక ఉదాహరణ.. ఇలాంటి ప్రకటనలతో.కౌశిక్ రెడ్డి తుపాకీ రాముణ్ణి మర్పిస్తున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గురించి తెలిసిన వాడు ఎవడు ఇలాంటి ప్రకటనలు చేయరు. ఆయన ఎన్నడూ.. ఎవరికి లొంగని వ్యక్తిత్వం ఉన్న నేత అని పేర్కొన్నారు. తీవ్రమైన ప్రతికూల పరిస్థితులలో కూడా ఆయన వెనకడుగు వేయని నైజం ఉన్న నాయకుడు అన్నారు.

జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ గా, ఎమ్మెల్యేగా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఎంపీగా, టీపీసీసీ అధ్యక్షుడుగా, సీఎం గా ఆయన తన స్వంత పోరాటంతో ఎదిగిన నాయకులు రేవంత్ రెడ్డి అని అన్నారు. ఆత్మ గౌరవం ఉన్న నాయకుడు, పదవుల కోసం ఎక్కడ కూడా చేయి చాపే తత్వం ఆయనకు లేదన్నారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులలో ఒకరిగా ఆయనను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెప్తున్నా.. ఆయన పదవుల కోసం ఎన్నడూ ఎవరి వెంట తిరగడు అని పేర్కొన్నారు

రేవంత్ రెడ్డికి పదవులు ఒట్టిగానే రాలేదు.. ఉద్యమాలతోనే వరించాయి తప్ప.. ఆయన పదవుల వెంట తిరగలేదన్నారు.గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి.. కౌశిక్ రెడ్డి తెలంగాణ లో రెచ్చగొట్టే రాజకీయాలు చేసి అశాంతి నెలకొల్పేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అరికపూడి గాంధీ విషయంలో కూడా ఆయనను రెచ్చగొట్టి గొడవలు సృష్టించారన్నారు. దేనికైనా ఒక హద్దు ఉంటది.. ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు.. కౌశిక్ రెడ్డిని కంట్రోల్ చేసుకునే బాధ్యత ఆ పార్టీ పెద్దలదేన‌న్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే జరగబోయే పరిణామాలకు ఆయన బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకత్వం ఆయనను హద్దులో ఉంచితే వాళ్ళకే మంచిది అని హితువు ప‌లికారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story