తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఇచ్చిన హామీల‌ను నెరవేర్చకుండా మోసం చేశారంటూ కేసీఆర్‌పై భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. భ‌ద్రాచ‌ల సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి మొదటిసారి వచ్చినప్పుడు రూ.100 కోట్లతో రామాలయ అభివృద్ధి చేస్తానని మాట త‌ప్పారు. మరలా వరదల సమయంలో 2022లో వచ్చినప్పుడు రూ.1000 కోట్లు కేటాయించి క‌ర‌క‌ట్ట ఎత్తు నిర్మాణ ప‌నుల‌తో పాటు..

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఇచ్చిన హామీల‌ను నెరవేర్చకుండా మోసం చేశారంటూ కేసీఆర్‌పై భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. భ‌ద్రాచ‌ల సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి మొదటిసారి వచ్చినప్పుడు రూ.100 కోట్లతో రామాలయ అభివృద్ధి చేస్తానని మాట త‌ప్పారు. మరలా వరదల సమయంలో 2022లో వచ్చినప్పుడు రూ.1000 కోట్లు కేటాయించి క‌ర‌క‌ట్ట ఎత్తు నిర్మాణ ప‌నుల‌తో పాటు.. వరద బాధితులకు పక్కా ఇండ్ల నిర్మాణాలు చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకూ వంద రూపాయలు కూడా హామీలో భాగంగా ఇవ్వలేదని, సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోని ప్రజలను మోసం చేశార‌ని శాసనసభ్యుడు పొదెం వీరయ్య సోమ‌వారం భద్రాచలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Updated On 17 July 2023 5:40 AM GMT
Ehatv

Ehatv

Next Story