తెలంగాణ(Telangana) రాష్ట్రం కోసం ఎంతో మంది పోరాడారని.. వందలాది మంది బలిదానాలు చేశారని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌(Congress) ఎంపీ మనీశ్ తివారీ(Manish Tiwari) అన్నారు. గాంధీ భ‌వ‌న్‌లో(Gandhi bhavan) ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..

తెలంగాణ(Telangana) రాష్ట్రం కోసం ఎంతో మంది పోరాడారని.. వందలాది మంది బలిదానాలు చేశారని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌(Congress) ఎంపీ మనీశ్ తివారీ(Manish Tiwari) అన్నారు. గాంధీ భ‌వ‌న్‌లో(Gandhi bhavan) ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తొలి విడత, రెండో విడత, మలి విడత పోరాటాలు.. 2014 వరకూ చాలా సుదీర్ఘంగా సాగాయన్నారు. 2014 ఫిబ్రవరిలో పార్లమెంట్‌లో బిల్లు పెట్టాం.. యువత బలిదానాలు, పోరాటం చూసి సోనియా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని వివ‌రించారు.

తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లవుతున్నా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. బీఆర్‌ఎస్‌(BRS) ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు. బీజేపీకి(BJP) బీఆర్‌ఎస్ బీ టీమ్ అని ఆరోపించారు. పార్లమెంట్‌లో అవకాశం వచ్చినప్పుడల్లా బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతిస్తూ వచ్చిందని అన్నారు. నోట్ల రద్దును(Demonitaization) అన్ని పార్టీలూ వ్యతిరేకించినా బీఆర్‌ఎస్ మాత్రం సమర్థించిందన్నారు. వ్యవసాయ చట్టాలను పార్టీలు వ్యతిరేకించినా బీఆర్‌ఎస్ మద్దతు తెలిపిందన్నారు. రాష్ట్రాల సమాఖ్యవాదాన్ని కేంద్రం దెబ్బతీస్తున్నా బీఆర్‌ఎస్ అండగా నిలిచిందని.. జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేస్తే అనుకూలంగా ఓటేసిందన్నారు.

రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తున్నదని.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా లక్షా అరవై వేల అప్పు ఉందని.. రాష్ట్రం వచ్చినప్పుడు మిగులు రాష్ట్రంగా ఉంటే.. ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందని దుయ్య‌బ‌ట్టారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారు.. అన్ని స్కీముల్లో అవినీతికి పాల్పడుతున్నారు.. దళితబంధు, డబుల్ బెడ్రూం ఇండ్ల స్కీమ్‌లలో కమీషన్లు తింటున్నరని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సెక్రటేరియెట్, మిషన్ భగీరథ వంటి వాటిలో కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని పారదోలాల్సిన అవసరం ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కొత్త‌ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురండని పిలుపునిచ్చారు.

Updated On 14 Nov 2023 5:33 AM GMT
Ehatv

Ehatv

Next Story