నేడు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం కొన‌సాగ‌నుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నర్సాపూర్ లో సాయత్రం 4.30 గంట‌ల‌కు ఎన్నికల ప్రచారంలో పాల్గోంటారు.

నేడు తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్(Congress) అగ్రనేతల ప్రచారం కొన‌సాగ‌నుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) నర్సాపూర్ లో సాయత్రం 4.30 గంట‌ల‌కు ఎన్నికల ప్రచారంలో పాల్గోంటారు. కాగా.. ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వ‌హిస్తారు. భువనగిరి, గద్వాల్, కొడంగల్ లో ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు భువనగిరి సభ, మధ్యాహ్నం 1.30 గంటలకు గద్వాల్ సభ, మధ్యాహ్నం 3.30 గంటలకు కొడంగల్ లో భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగింస్తారు.

చత్తీస్ గడ్ ముఖ్య‌మంత్రి భూపేష్ భగేల్(Bhupesh Bhaghel) నేడు 12.30 గంటలకు ఆదిలాబాద్, 3.30 గంటలకు నిజామాబాద్ ప్రచార సభలలో పాల్గొంటారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇల్లందు, డోర్నకల్, కొడంగల్ నియోజకవర్గాల్లో రేవంత్ ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు ఇల్లందు, 11 గంటలకు డోర్నకల్, మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రియాంక గాంధీతో కలిసి కొడంగల్ బహిరంగసభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు.

Updated On 26 Nov 2023 11:18 PM GMT
Yagnik

Yagnik

Next Story