మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav)పై కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత రావు(Sunitha Rao) తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. గాంధీ భ‌వ‌న్‌(Gandhi Bhavan)లో ఆమె మాట్లాడుతూ.. తలసాని శ్రీనివాస్ యాదవ్Minister Talasani Srinivas Yadav).. ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi), రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నావు..

మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav)పై కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత రావు(Sunitha Rao) తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. గాంధీ భ‌వ‌న్‌(Gandhi Bhavan)లో ఆమె మాట్లాడుతూ.. తలసాని శ్రీనివాస్ యాదవ్Minister Talasani Srinivas Yadav).. ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi), రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నావు.. పశువులా మాట్లాడకు తలసాని అంటూ తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీ నుండి వచ్చారు.. టీడీపీ పార్టీ లో ఆయన ఏం చేశారో అందరకీ తెలుసు అని అన్నారు.

రాబోయే రోజులో ఎవరి దమ్ము ఎంతో తెలుస్తుందన్నారు. అందరు దోచుకోవడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. శ్రీకాంత చారి చనిపోవడానికి కారణం తలసాని శ్రీనివాస్ కాదా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ సీఎం కుర్చీలో ఉన్నారు అంటే అది మా బిక్ష అన్నారు. దానం నాగేంద‌ర్‌ చేసిన అరాచకాలు అంతా ఇంత కాదని విమ‌ర్శించారు. మీరు చేసే అరాచకాలని అపండి శ్రీనివాష్ యాదవ్ అంటూ హెచ్చ‌రించారు. కేటీఆర్ ను ట్విట్టర్ వదిలి ప్రజలోకి రమ్మని చెప్పండని స‌ల‌హా ఇచ్చారు. ప్రియంకా గాంధీ, రేవంత్ అడిగిన వాటికీ సమాధానం చెప్పండి అంటూ డిమాండ్ చేశారు.

అంత‌కు ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. రేవంత్ ను వాడు వీడు అంటూ సంబోధించారు. నా కొడకా పిస్కుతే పానం పోతదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని.. వరదలు వచ్చినప్పుడు నగరవాసులు చాలా ఇబ్బందులు పడ్డారని.. దీనికి కారణం గత ప్రభుత్వాలే కాదా అని తలసాని ప్రశ్నించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో కొత్త బిచ్చ‌గాళ్లు వ‌స్తుంటార‌ని ఎద్దేవా చేశారు. యూత్ డిక్ల‌రేష‌న్ పై మండిప‌డ్డారు. కేసీఆర్ మాత్ర‌మే ఉద్యోగాలు ఇచ్చార‌ని అన్నారు.

Updated On 9 May 2023 5:35 AM GMT
Ehatv

Ehatv

Next Story