ఈ దేశానికి అన్నీ చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిందిస్తున్నారని పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి మండిప‌డ్డారు. ఆయ‌న గాంధీభ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ..

ఈ దేశానికి అన్నీ చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిందిస్తున్నారని పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి మండిప‌డ్డారు. ఆయ‌న గాంధీభ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందని మాట్లాడుతున్నారు.. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు కాబట్టే.. కేసీఆర్ సీఎం అయ్యాడు.. కేసీఆర్ కుటుంబం అంతా సెట్ అయ్యింద‌న్నారు. కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ ఏం చేసింది అనేది ఊత పదం అయ్యింది.. సమైక్య రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యేవాడా..? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడే అని గుర్తుచేశారు. ఇందిరా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆరేళ్ళ జైలు శిక్ష అనుభవించారు. బీజేపీ నేతలకు ఈ చరిత్ర ఉందా..? అని ప్ర‌శ్నించారు. మోదీ, అమిత్ షాలకు ఉందా ఇందిరమ్మకు ఉన్న చరిత్ర‌.. అమిత్ షా.. జైలుకు ఎందుకు వెళ్ళాడో అందరికి తెలుసన్నారు.

దళితులకు, గిరిజనులకు భూములు పంచిన చరిత్ర ఇందిరమ్మదన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇచ్చిన భూములపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. మోడీ కానీ..కేసీఆర్ కానీ ఒక్క ఇంచు భూమి అయినా ఇచ్చారా..? అని ప్ర‌శ్నించారు. బ్యాంకులను జాతీయం చేశారు ఇందిరమ్మ.. ప్రతీ ఊర్లో బ్యాంకులు ఉన్నాయంటే ఇందిరమ్మె కారణం కాదా? అని అడిగారు. రోటీ కపడా మకాన్ నినాదంతో ప్రతీ పేద ఇంటికి ఇందిరమ్మ పేరు వెళ్ళిందన్నారు.

Updated On 23 April 2024 8:19 AM GMT
Yagnik

Yagnik

Next Story