తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)సమావేశాలు వాడిగా వేడిగా జరుగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)సమావేశాలు వాడిగా వేడిగా జరుగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. బడ్జెట్‌(Budget)పై మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)తనదైన శైలిలో సెటైర్లు విసిరారు. ఘాటుగా విమర్శించారు. సుతిమెత్తని మాటలతో అధికారపక్షాన్ని ఇరుకునపెట్టారు. కాంగ్రెస్‌(Congress)అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో(8 Months) ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు కేటీఆర్‌. ఇచ్చామని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) అశోక్‌న‌గ‌ర్‌(Ashok Nagar)కు వచ్చారని, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్‌ విడుదల చేస్తామని, ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తి చేస్తామని ట్వీట్‌ కూడా చేశారని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు. గోబెల్స్‌(Globells) అనేవాడు బతికే ఉంటే కనుక రాహుల్ ట్వీట్, వీరి నిర్వాకం చూసి వీరి ద‌గ్గ‌ర ట్యూష‌న్ కోసం వచ్చేవాడని కేటీఆర్‌ చెప్పారు. '30 వేల ఉద్యోగాలు ఇచ్చామ‌ని బ‌డ్జెట్‌లో చెప్పారు. నోటిఫికేష‌న్లు ఎప్పుడు ఇచ్చారు.. ప‌రీక్ష ఎప్పుడు జ‌రిగింది. నియామ‌కాలు ఎప్పుడు ఇచ్చారో చెప్పాలి' అని కేటీఆర్ డిమాండ్ చేశారు. 'ఆ 30 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఎప్పుడో ఇచ్చామో తేదీలు ఉన్నాయి. స్టాఫ్ న‌ర్సుల‌కు(Staff Nurse) 2022 డిసెంబ‌ర్ 20న నోటిఫికేష‌న్ ఇచ్చి 2023 ఆగ‌స్టులో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. సింగ‌రేణి ఉద్యోగుల‌కు 2022 జూన్‌లో నోటిఫికేష‌న్ ఇచ్చి అదే ఏడాది సెప్టెంబ‌ర్‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. పోలీసు కానిస్టేబుల్(Police Conistable) ఉద్యోగాల‌కు ఏప్రిల్ 2022లో నోటిఫికేష‌న్ ఇచ్చాం. 2022 ఆగ‌స్టులో ప్రిలిమ్స్, 2023 జ‌న‌వ‌రిలో ఫిజిక‌ల్ టెస్టులు, 2023 ఏప్రిల్‌లో మెయిన్స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. ఇవ‌న్నీ క‌లిపి 30 వేల ఉద్యోగాలు మేం ఇచ్చాం మేం ఇచ్చాం అంటున్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వంలో ప‌రీక్ష‌లు పూర్త‌య్యాయి. ఇప్పుడు వీరు నియామ‌క ప్ర‌తాలు ఇచ్చారు. ప్ర‌జ‌ల‌ను, నిరుద్యోగ యువ‌త‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన మీ మీద ఛార్జిషీటు వేయాలి. జాబుల జాత‌ర బ‌దులు అబ‌ద్దాల జాత‌ర న‌డుస్తుంది. ఇంట్లో ఉన్న క్యాలెండ‌ర్ మ‌రో నాలుగు నెల‌ల్లో మారిపోత‌ది కానీ జాబ్ క్యాలెండ‌ర్ అత్త లేదు.. ప‌త్త లేదు' అని కేటీఆర్ విమ‌ర్శించారు. 'సభ వాయిదా తర్వాత డిప్యూటీ సీఎం భ‌ట్టి(Deputy Cm Bhatti), అవ‌స‌ర‌మైతే సీఎం రేవంత్‌(CM Revanth)ను కూడా అశోక్‌నగర్‌కు తీసుకెళ్దాం. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ప‌ర్స‌న‌ల్‌గా వెళ్దాం. అశోక్‌న‌గ‌ర్‌లో ఏ ఒక్క యువ‌తి, యువ‌కుడు అయినా కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో కొత్త‌గా ఒక్క ఉద్యోగం వ‌చ్చింద‌ని చెబితే అక్క‌డే నేను రాజీనామా చేసి రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాను. కొత్త‌గా ఉద్యోగాలు ఇచ్చార‌ని ఎవ‌రైనా చెబితే అక్క‌డే ఉన్న సిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీలో(City Central Library)మా పార్టీ త‌ర‌పున ల‌క్ష‌లాది యువ‌కుల‌తో సీఎం, డిప్యూటీ సీఎంకు పౌర స‌న్మానం చేయిస్తాను' అని కేటీఆర్ గట్టిగా వాదించారు.

ehatv

ehatv

Next Story