కాంగ్రెస్‌కు(Congress) గద్వాల ఎమ్మెల్యే(Gadwal MLA) బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(MLA krishnamohan) షాక్‌ ఇచ్చారు.

కాంగ్రెస్‌కు(Congress) గద్వాల ఎమ్మెల్యే(Gadwal MLA) బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(MLA krishnamohan) షాక్‌ ఇచ్చారు. ఇటీవలే బీఆర్‌ఎస్‌(BRS) నుంచి కాంగ్రెస్‌లో(Congress) చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మళ్లీ సొంత గూటికి చేరుకున్నాడు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) సమక్షంలో బీఆర్‌ఎస్‌లో(BRS) చేరిపోయారు. కాంగ్రెస్‌లో పొసగక పోవడం, గ్రూపు తగాదాలు ఉండడంతో సొంత గూటికి వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని మాజీ జెడ్పీచైర్ పర్సన్‌ సరిత వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఏకంగా గాంధీభవన్‌లో ధర్నా కూడా చేపట్టారు. ఒకవైపు కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు, అనర్హత వేటు అంశం కూడా పరిగణనలోకి తీసుకొని మళ్లీ సొంత గూటికి చేరారని తెలిసింది.

Eha Tv

Eha Tv

Next Story