మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) బీఆర్ఎస్(BRS) పార్టీలో చేరారు. ఇటీవల కాంగ్రెస్(Congress) పార్టీకి రాజీనామా చేసిన పొన్నాల‌.. సోమవారం జనగామలో బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్(KCR) సమక్షంలో పార్టీలో చేరారు.

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) బీఆర్ఎస్(BRS) పార్టీలో చేరారు. ఇటీవల కాంగ్రెస్(Congress) పార్టీకి రాజీనామా చేసిన పొన్నాల‌.. సోమవారం జనగామలో బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్(KCR) సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. నాలుగున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉండి ఇప్పుడు అవమానాలకు గురయ్యానన్నారు. జనగామ అభివృద్ధి కోసం తాను బీఆర్ఎస్‌లో చేరినట్లు తెలిపారు. జనగామ నియోజకవర్గంలో కేసీఆర్ ఏడు రిజర్వాయర్లు నిర్మించారన్నారు. జనగామలో పాడిపరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని కోరారు. జనగామకు కేసీఆర్ మరింత ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి అయిన మూడేళ్లకే కేసీఆర్ కులగణన, సమగ్ర సర్వే చేయించారన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.

Updated On 16 Oct 2023 7:02 AM
Ehatv

Ehatv

Next Story