రోజురోజుకీ కాంగ్రెస్(Congress) పార్టీ గ్రాఫ్ పెరుగుతోందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్(Ashok chavan) అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో(Gandhi Bhavan) ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణలో(Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

రోజురోజుకీ కాంగ్రెస్(Congress) పార్టీ గ్రాఫ్ పెరుగుతోందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్(Ashok chavan) అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో(Gandhi Bhavan) ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణలో(Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. రాహుల్(Rahul) కాళేశ్వరం సందర్శన వెళ్లిన తర్వాత అనేక నిజాలు బయటపడుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఏం లాగా ఉపయోగపడుతోందన్నారు. కమిషన్ల కోసం కాళేశ్వరం అంచనాలను పెంచారని ఆరోపించారు.

కాంగ్రెస్ మొదలుపెట్టిన అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టును బీఆర్ఎస్ కాళేశ్వరంగా మార్చిందన్నారు. కాళేశ్వరం పేరు చెప్పుకొని బీఆర్ఎస్(BRS) ఓట్లు దండుకుందన్నారు. కాళేశ్వరంపై(Kaleshwaram) విమర్శలు చేస్తున్న బీజేపీ ఎలాంటి విచారణ చేయడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో లోపాలు ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వృధా చేసిన సొమ్ము తెలంగాణ ప్రజలపై అప్పుగా మారిందన్నారు.

కాళేశ్వరం డబ్బులు ఎక్కడ పోయాయని ప్ర‌శ్నించారు. రైతుల కోసం నీళ్ళు ఇవ్వడానికి అని చెప్తూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణలో మేం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామ‌న్నారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకునే ట్రాక్ రికార్డ్ కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు.

Updated On 2 Nov 2023 7:05 AM GMT
Ehatv

Ehatv

Next Story