దేశం కోసం గాంధీ కుటుంభం ఎన్నో త్యాగాలు చేశారని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ న‌గ‌ర్‌లో జ‌రిగిన స‌మావేశంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ..

దేశం కోసం గాంధీ కుటుంభం(Gandhi Family) ఎన్నో త్యాగాలు చేశారని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. ఎల్బీ స్టేడియం(LB Stadium)లో జ‌రిగిన స‌మావేశంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గానే ఎంపీ గానో ఎన్నికై 6 నెలలు కాక ముందే మంత్రి, కేంద్ర మంత్రి కావాలని అడిగే ఈరోజుల్లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఏనాడూ అయిన ప్రధాని చేయండని ఎప్పుడైనా అడిగాడా అని ప్ర‌శ్నించారు. స్వతంత్ర పోరాటంలో బీజేపీ(BJP) పాత్ర ఏంటిదో ప్రస్తుత బీజేపీ నాయకులు చెప్పాలన్నారు. తెలంగాణ ఇచ్చిన గాంధీ పార్టీనీ మనం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలన్నారు.

మనకు మోదీతో యుద్ధం.. గల్లీలో ఉన్న బిల్లా(Billa), రంగా(Ranga) లతో కాదన్నారు. జనాలు బీఆర్ఎస్‌ ను ఊరికే ఓడగొట్టలేదు.. జనాలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి జనాలు బీఆర్ఎస్‌ను ఓడగొట్టారని వివ‌రించారు. ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల లోపు మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేసాము. ఫిబ్రవరిలో మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు.

బీఆర్ఎస్‌(BRS) ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. ఏ హామీని అమలు చేయని బీఆర్ఎస్‌ నాయకులకు మమ్మల్ని అడిగే హక్కు లేదన్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకూ రైతు బందు పూర్తిగా వేస్తామన్నారు. రేవంత్ రెడ్డి నిజంగానే మేస్త్రినే.. మీరు విద్వంసం చేసిన విద్వాంసంను సరి చేసే మేస్త్రినీ నేను.. మిమ్మలని 100 మీటర్ల‌ లోతులో ఘోరీ కట్టే మేస్త్రిని నేనే అని వ్యాఖ్యానించారు.

ఈ నెలాఖరుకు ఇంద్రవెల్లి(Indravelli)కి వస్తున్న కాసుకొండి బిడ్డలారా అంటూ స‌వాల్ విసిరారు. ఎవర్ని కెసీఆర్(KCR) నువ్వు రాజ్యసభ సభ్యులు చేసింది. కరోనా కాలంలో వేల కోట్లు దోచుకున్న పార్థ సారథి రెడ్డిని, రవిచంద్ర, దామోదరరావులను రాజ్యసభ సభ్యులను చేసావు. తెలంగాణలో కాంగ్రెస్ చిన్న చిన్న కార్యకర్తలకు టికెట్ లు ఇస్తే ఎమ్మేల్యేలు అయ్యారు. మరి నువ్వు ఎవరికి టికెట్ లు ఇచ్చావు అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ ఒక దళితున్ని ఎఐసీసీ(AICC) చీఫ్ చేసింది. మరి నువ్వు ఎవర్ని చేసావు అని నిల‌దీశారు.

17 పార్లమెంట్ స్థానాల్లో నేను సభలు పెడుతాను. మొన్నటి ఎన్నికల్లో మీ పార్టీని ఒడించాము. ఈ ఎన్నికల్లో మేము గెలిచి బిల్లా రంగాలను తెలంగాణ సరిహద్దులను దాటిస్తామన్నారు. బిల్లా, రంగాలు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు. చార్లెస్ సోబారాజు ఇంట్లో దుప్పటి పట్టుకుని పడుకున్నాడు. పులి బయటికి వస్తుంది అన్నాడు కదా.. రమ్మని చెప్పండి.. బోను పట్టుకుని రెడీగా ఉన్నామన్నారు.

మోడీModi), కేడి రెండు ఒక్కటే.. నాణేనికి మోడీ ఒక వైపు కెసీఆర్ ఒక వైపు.. ఇక్కడ గెలిచిన ఒకటో రెండో సీట్లు కూడా కెసీఆర్ మోడీకి తాకట్టు పెడతాడన్నారు. కెసీఆర్ నీ పీక పిసికే బాధ్యత మా పార్టీ తీసుకుంది. ఇందిరమ్మ కమిటీలు వేస్తాము. అందులో బూత్ లెవల్ కమిటీ సభ్యులు ఉంటారని పేర్కొన్నారు.

Updated On 25 Jan 2024 8:52 AM GMT
Yagnik

Yagnik

Next Story