రైతుల రుణమాఫీపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రతీ కుటుంబం, రేషన్‌ కార్డును యూనిట్‌గా తీసుకోనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రతీ యూనిట్‌లో మొదట మహిళల పేరుతో ఉన్న రుణాలను మాఫీ చేయనున్నారు.

రైతుల రుణమాఫీపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రతీ కుటుంబం, రేషన్‌ కార్డును యూనిట్‌గా తీసుకోనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రతీ యూనిట్‌లో మొదట మహిళల పేరుతో ఉన్న రుణాలను మాఫీ చేయనున్నారు.ఆ తర్వాత ప్రాధాన్యత ప్రకారం రుణాలను మాఫీ చేయనున్నట్టు మార్గదర్శకాల్లో తెలిపారు. అయితే, రుణమాఫీ అమలుకు రేషన్‌ కార్డు తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక, చిన్న మొత్తంలో రుణమాఫీలను చేసిన తర్వాతే పెద్ద అమౌంట్‌ను మాఫీ చేయనున్నారు. స్వల్పకాలిక రుణాలను కూడా మాఫీ చేయనున్నారు. అలాగే.. రెండు లక్షల పైబడి ఉన్నా రుణాలకు రైతులే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. రెన్యువల్‌ చేసిన రుణాలకు ఈ పథకం వర్తించదు. పీఎం కిసాన్‌ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. అన్ని వాణిజ్య బ్యాంక్‌లు, గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ వర్తిస్తుంది. మరోవైపు 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 9వ తేదీ వరకు తీసుకున్న అన్ని పంటలకు రుణమాఫీ చేయనున్నారు.

Eha Tv

Eha Tv

Next Story