కేసీఆర్(KCR) వైద్యంపై ఎప్పటికప్పుడు సమాచారం తనకు తెలియచేయాలని ఐఎఎస్‌లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సూచించారు. గురువారం అర్ధరాత్రి కేసీఆర్‌ కాలు జారి కిందపడటంతో తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోదా హాస్పిటల్‌కు తరలించారు. ఆయనను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కేసీఆర్(KCR) వైద్యంపై ఎప్పటికప్పుడు సమాచారం తనకు తెలియచేయాలని ఐఎఎస్‌లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సూచించారు. గురువారం అర్ధరాత్రి కేసీఆర్‌ కాలు జారి కిందపడటంతో తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోదా హాస్పిటల్‌కు తరలించారు. ఆయనను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. తుంటి ఎముక విరిగినట్టు గుర్తించిన వైద్యులు సాయంత్రం ఆయనకు హిప్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ చేయనున్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి ముఖ్యమంత్రి సూచించారు. రేవంత్‌ ఆదేశాల మేరకు యశోద ఆసుపత్రికి ఆరోగ్యశాఖ కార్యదర్శి వెళ్లారు. కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్‌ సెక్రటరీకి చెందిన యశోదా ఆసుపత్రి వైద్యులు.

Updated On 8 Dec 2023 1:05 AM GMT
Ehatv

Ehatv

Next Story