వరదల(Floods) కారణంగా తెలంగాణలో(Telangana) భారీగా పంట నష్టం ఏర్పడింది. ముఖ్యంగా ఖమ్మం(Khammam) జిల్లాలో ఆ నష్టం చాలా ఎక్కువగా ఉంది.

వరదల(Floods) కారణంగా తెలంగాణలో(Telangana) భారీగా పంట నష్టం ఏర్పడింది. ముఖ్యంగా ఖమ్మం(Khammam) జిల్లాలో ఆ నష్టం చాలా ఎక్కువగా ఉంది. అనేక కుటుంబాలు, ప్రజలు సర్వస్వం కోల్పోయారు. ఇళ్లలోని వస్తువులు వరద పాలయ్యాయి. ఇంటి నిండా బురద నిండిపోయింది. పశువులను కూడా కాపాడుకోలేకపోయారు. వరద ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth reddy) పర్యటించారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు పర్యటించారు. కొందరు ఇంకా పర్యటిస్తూనే ఉన్నారు. అలాగే కేంద్ర మంత్రి వచ్చి జరిగిన నష్టంపై ఏరియల్ సర్వే చేశారు. సుమారు. అయిదు వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం సంభవించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.అయితే.. ప్రత్యక్షంగా వెళ్లి బాధితుల బాధలు విన్న రేవంత్ రెడ్డి వారి కోసం కుటుంబానికి పది వేల రూపాయల సాయం చేస్తామని ప్రకటించారు. అయితే ఆ సహాయం సరిపోదని ముఖ్యమంత్రి భావించినట్లుగా తెలుస్తోంది. అందుకే.. వరద సాయం మరింత పెంచాలని భావిస్తున్నారట. ఇంటింటికీ ఇస్తామన్న రూ.10 వేలను రూ.17,500కు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇంటి మరమ్మతుల కోసం రూ.6,500, దుస్తుల కోసం రూ.2,500, వస్తువులకు రూ.2,500, కూలీ కింద రూ.6,000 కలిపి మొత్తంగా రూ.17,500 ఇవ్వనున్నట్లు సమాచారం.

Eha Tv

Eha Tv

Next Story