ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్‌తో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సీఎం రేవంత్‌ జూబ్లీహిల్స్ నివాసంలో ఆదివారం వీరు సమావేశమయ్యారు.

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్‌(RBI Governor Raghuramarajan)తో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో భేటీ అయ్యారు. సీఎం రేవంత్‌ జూబ్లీహిల్స్(Jubilee Hills) నివాసంలో ఆదివారం వీరు సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్.. సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క(Bhatti Vikramarka), శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu), సీఎస్ శాంతి కుమారి(Shanthi Kumar), స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణా రావు(Ramakrishna Rao), సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి(Sheshadri) పాల్గొన్నారు.

Updated On 17 Dec 2023 4:26 AM GMT
Yagnik

Yagnik

Next Story