తెలంగాణా సాంస్కృతిక సారధి ఉద్యోగులకు(TSS Employees) కేసీఆర్(KCR) స‌ర్కార్‌ శుభవార్త చెప్పింది. సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ(PRC) అమలుచేస్తూ సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ 2020 ప్రకారం.. టీఎస్ఎస్(తెలంగాణా సాంస్కృతిక సారధి) ఉద్యోగులకు పీఆర్సీ అమ‌లు వ‌ర్తించ‌నుంది

తెలంగాణా సాంస్కృతిక సారధి ఉద్యోగులకు(TSS Employees) కేసీఆర్(KCR) స‌ర్కార్‌ శుభవార్త చెప్పింది. సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ(PRC) అమలుచేస్తూ సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ 2020 ప్రకారం.. టీఎస్ఎస్(తెలంగాణా సాంస్కృతిక సారధి) ఉద్యోగులకు పీఆర్సీ అమ‌లు వ‌ర్తించ‌నుంది. పెంచిన పీఆర్సీ 2021, జూన్ 1 వ తేదీ నుంచి సంబంధిత ఉద్యోగుల‌కు వ‌ర్తిస్తుంది. ఈ మేర‌కు పీఆర్సీ అమలుకు తదుపరి చర్యలు తీసుకోవాలని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలావుంటే.. మూడు నెల‌ల‌ క్రితమే టీఎస్ఎస్ ఉద్యోగుల పీఆర్సీకి ఆర్థికశాఖ క్లియరెన్స్ ఇవ్వ‌గా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణా సాంస్కృతిక సారధిలో మొత్తం 583 మంది ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులంద‌రికీ ప్రస్తుత పే స్కేలు మీద 30% పీఆర్సీని ప్రభుత్వం అమలు చేయనుంది. తెలంగాణా సాంస్కృతిక సారధి ఉద్యోగుల ప్రస్తుత పే స్కేలు రూ. 24,514 లు కాగా.. ఒక్కొక్కరికి రూ. 7300 ల మేరకు జీత భత్యాలు పెరిగే అవకాశం ఉంది.

Updated On 29 Aug 2023 1:14 AM GMT
Ehatv

Ehatv

Next Story