తెలంగాణ ప్రభుత్వం అత్యంత‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన నూతన సెక్రటేరియట్ భ‌వ‌న స‌ముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. అనంత‌రం ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. వేద పండితుల ఆశీర్వచనాల‌తో కుర్చీలో కూర్చున్నారు.

తెలంగాణ(Telangana) ప్రభుత్వం అత్యంత‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన నూతన సెక్రటేరియట్(Telangana Secretariat) భ‌వ‌న స‌ముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదివారం ప్రారంభించారు. అనంత‌రం ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. వేద పండితుల ఆశీర్వచనాల‌తో కుర్చీలో కూర్చున్నారు. ఆపై కేసీఆర్‌ ఆరు పైళ్ల‌పై సంతకాలు చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

అంత‌కుముందు సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. మేయిన్‌ గేట్‌ వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగ‌తం ప‌లికారు. అక్కడి నుంచి నడుకుంటూ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాగశాలను సందర్శించారు. యాగ‌శాల‌లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

ఈ కార్య‌క్ర‌మంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి(Pocharam Srinivas Reddy), మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, మంత్రులు ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డి, నిరంజన్‌ రెడ్డి, హరీశ్‌ రావు, గంగుల కమలాకర్‌, జగదీశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వరరావు, పలువులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.

Updated On 30 April 2023 3:28 AM GMT
Yagnik

Yagnik

Next Story