తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. వ‌ర‌ద బాధితుల స‌హాయార్థం మెగాస్టార్ చిరంజీవి రూ. 50 లక్షలు విరాళం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. వ‌ర‌ద బాధితుల స‌హాయార్థం మెగాస్టార్ చిరంజీవి రూ. 50 లక్షలు విరాళం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.. అందుకు సంబంధించిన చెక్‌ను సీఎం రేవంత్‌కు ఆయ‌న సోమ‌వారం అంద‌జేశారు. అలాగే త‌న‌యుడు రామ్ చరణ్ తరపున మరో రూ.50 లక్షలు కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. రెండు చెక్కులను చిరంజీవి జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయ‌న‌ను క‌లిసి అందజేశారు.

ఇదిలావుంటే.. ఇటీవ‌ల చిరంజీవి త‌మ్ముడు, ఏపీ ఉప ముఖ్య‌మంత్రి పవన్ కల్యాణ్ కూడా తెలంగాణ వరద బాధితులకు రూ.1 కోటి విరాళం ప్ర‌క‌టించడంతోపాటు సీఎంను క‌లిసి స్వ‌యంగా అంద‌జేశారు. ఇందుకు సంబంధించి.. పవన్ కళ్యాణ్ తనను కలిశారని, వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదిక‌గా తెలిపారు. జనసేనానికి నా తరఫున, తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story