ప్ర‌ముఖ‌ యూట్యూబర్ హర్ష సాయిపై ఓ యువతి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది

ప్ర‌ముఖ‌ యూట్యూబర్ హర్ష సాయిపై ఓ యువతి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అడ్వకేట్‌తో సహా పోలీసు స్టేషన్ కు చేరుకున్న యువ‌తి.. హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేర‌కు పోలీసులు హర్ష సాయిపై 328, 37692), 354, 376(N) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. హర్ష సాయిపై ఫిర్యాదు చేసిన యువ‌తి బిగ్‌బాస్ ఓటీటీ కంటెస్టెంట్ కావ‌డం విశేషం.

త‌న‌ను నగ్న చిత్రాలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ చేశాడని.. యువతి ఫిర్యాదు చేసిందని.. ఆమె ఫిర్యాదు మేరకు హర్షసాయిపై కేసు నమోదు చేశామని రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. తనను పెళ్లి చేసుకుంటానని హర్ష సాయి నమ్మించి మోసం చేశాడని.. తన వద్ద రూ. 2 కోట్లు తీసుకున్నాడని యువ‌తి తన ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదులో హర్ష సాయి తండ్రి పేరును కూడా చేర్చింది బాధిత యువ‌తి.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story