సోమ‌వారం జలసౌదాలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రెండు కేబినెట్ సబ్ కమిటీల సమావేశాలు జ‌రుగ‌నున్నాయి

సోమ‌వారం జలసౌదాలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రెండు కేబినెట్ సబ్ కమిటీల సమావేశాలు జ‌రుగ‌నున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా ఉన్న రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కేబినెట్ సబ్ కమిటీ, ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీల సమావేశాలు జ‌రుగ‌నున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జ‌రుగుతుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జ‌రుగ‌నుండ‌గా.. మంత్రులు దామోదర్ రాజా నర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొననున్నారు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ కోసం గతంలో ఎమ్మెల్యేలకు, రాజకీయ పార్టీలకు సబ్ కమిటీ లేఖలు రాసింది. దీనిపై వచ్చిన సిఫారసులు, విధి విధానాలు అంశాలపై చర్చించ‌నున్నారు. ఆ త‌ర్వాత మధ్యాహ్నం 3.45 గంటలకు సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు పాల్గొంటారు

అనంతరం 4 గంటల తరువాత తిరిగి జలసౌదలో ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావేశలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. వర్గీకరణ అమలుకు సంబంధించిన అంశాలపై చర్చ ఉంటుంది. సమావేశంలో కో చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొంటారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story