సీఎం రేవంత్‌రెడ్డిపై(CM revanth reddy) మరోసారి విరుచుకుపడ్డారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).

సీఎం రేవంత్‌రెడ్డిపై(CM revanth reddy) మరోసారి విరుచుకుపడ్డారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనపై సెటైర్లు వేశారు. పైసా పని చేసేది లేదు.. అయిననూ పోయిరావాలి ఢిల్లీ అంటూ కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు వదిలారు. 10 నెలల్లో 25 సార్లు వెళ్లి 50 రోజులు ఢిల్లీలోనే ఉన్నా తట్ట మట్టి తీసింది లేదన్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఎక్స్‌లో ట్వీట్ చేశారు కేటీఆర్. 'పైసా పనిలేదు - రాష్ట్రానికి రూపాయి లాభం లేదు.. 10 నెలలు - 25 సార్లు - 50రోజులు.. పోను 25 సార్లు, రాను 25 సార్లు, నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివి. తట్టా మట్టి తీసింది లేదు కొత్తగా చేసింది అసలే లేదు.. అయినను పోయి రావాలె హస్తినకు.. అన్నదాతల అరిగోసలు.. గాల్లో దీపాల్లా గురుకులాలు.. కుంటుపడ్డ వైద్యం

గాడి తప్పిన విద్యా వ్యవస్థ.. అయినను పోయి రావాలె హస్తినకు.. మూసి పేరుతో - హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొట్టి - 420 హామీలను మడతపెట్టి మూలకు వేసి.. అయినను పోయి రావాలె హస్తినకు.. పండగలు పండగళ్ళా లేవు ఆడబిడ్డల చీరలు అందనేలేవు అవ్వాతాతలు అనుకున్న పింఛను లేదు తులం బంగారం జాడనే లేదు స్కూటీలు లేవు, కుట్టు మిషిన్లు లేవు.. అయినను పోయి రావాలె హస్తినకు..' అంటూ ట్వీట్ చేశారు.

Eha Tv

Eha Tv

Next Story