నర్సాపూర్(Narsapur) ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డిని(Sunitha Lakshma Reddy) బీఆర్ఎస్(BRS) అధినేత సీఎం కేసీఆర్(CM KCR) ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి ఆమెకు బీఫామ్ అందచేశారు. మదన్ రెడ్డికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించిన‌ట్లు తెలుస్తుంది.

నర్సాపూర్(Narsapur) ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డిని(Sunitha Lakshma Reddy) బీఆర్ఎస్(BRS) అధినేత సీఎం కేసీఆర్(CM KCR) ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి ఆమెకు బీఫామ్ అందచేశారు. మదన్ రెడ్డికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించిన‌ట్లు తెలుస్తుంది. ఈ మేర‌కు అధినేత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయిన బీఆర్ఎస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులు పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మదన్ రెడ్డి(Madhan Reddy) నాతో పార్టీలో మొదటినుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడు. 35 ఏండ్ల నుంచి నాతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా నాకు అత్యంత ఆప్తుడు. నాకు కుడి భుజం లాంటి వాడు. సోదర సమానుడు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాలమీద వేసుకుని సునీత లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా వుంది. ప్రస్థుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుండి మదన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కీలక సభ్యులకు, కార్యవర్గానికి అభినందనలు. వారి సీనియారిటిని పార్టీ గుర్తించి గౌరవించినందుకు పార్టీ ముఖ్య కార్యవర్గాన్ని అభినందిస్తున్నాను.

మెదక్(Medak) జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కేవలం నర్సాపూర్‌లోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మ‌ద‌న్ రెడ్డి పాపులర్ లీడర్. వివాద రహితుడు సౌమ్యుడు అయిన‌ మదన్ రెడ్డి సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవాల్సివుంది. నాతో పాటు కలిసి సునీతకు నర్సాపూర్ నియోజకవర్గ బీఫామ్ ఇవ్వడం నాకు సంతోషాన్ని కలిగించింది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారని కొనియాడారు. ఈ సంద‌ర్భంగా మ‌ద‌న్ రెడ్డికి కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

Updated On 25 Oct 2023 7:11 AM GMT
Ehatv

Ehatv

Next Story