నేటితో తెలంగాణ‌లో ఎన్నికల ప్రచారం(Telangana Election campaign) ముగుస్తుంది. పోలింగ్(Polling) 30వ తేదీన ఉంది. దీంతో బ‌రిలో ఉన్న అభ్య‌ర్ధుల్లో టెన్ష‌న్ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలోనే హుజురాబాద్‌(Huzurabad) బీఆర్ఎస్‌(BRS) అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి(Koushik Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

నేటితో తెలంగాణ‌లో ఎన్నికల ప్రచారం(Telangana Election campaign) ముగుస్తుంది. పోలింగ్(Polling) 30వ తేదీన ఉంది. దీంతో బ‌రిలో ఉన్న అభ్య‌ర్ధుల్లో టెన్ష‌న్ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలోనే హుజురాబాద్‌(Huzurabad) బీఆర్ఎస్‌(BRS) అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి(Koushik Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హన్మ‌కొండ‌ జిల్లా కమలాపూర్‌లో ప్ర‌చారంలో పాల్గొన్న‌ కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి తనను ఓటేసీ గెలిపించకపోతే భార్యా, బిడ్డల‌తో కలిసి ఉరివేసుకుంటాన‌ని వ్యాఖ్యానించారు. తాను ఈ ఎన్నిక‌ల‌లో గెల‌వ‌క‌పోతే.. మా ముగ్గురి శ‌వాల‌ను చూస్తార‌ని అన్నారు.

3న వెలువ‌డే ఫలితాలలో తాను గెలిస్తే విజయ యాత్రకు వ‌స్తా.. ఓడితే 4వ తారీఖు నా శవయాత్రకు మీరు రండి అని అన్నారు. ఇక మీ ఇష్టం.. మ‌మ్మ‌ల్ని కాపాడుకుంటర‌ని ఆశిస్తున్నా.. ఈ ఒక్క సారి నాకు అవకాశం కల్పిస్త‌ర‌ని భావిస్తున్నా.. మీ ద‌య‌.. 30న పోలింగ్ ఉంద‌ని.. ఈ ఒక్క‌సారి నాకు ఓటేయ్యండ‌ని ఓటు అభ్య‌ర్ధించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Updated On 28 Nov 2023 5:25 AM GMT
Ehatv

Ehatv

Next Story