ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో బీఆర్ఎస్ నాయ‌కుడు, మ‌ల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కొడుకు రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

ఢిల్లీ(Delhi)లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjuna Kharge) సమక్షంలో బీఆర్ఎస్ నాయ‌కుడు, మ‌ల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Mynampalli Hanumantharao), ఆయన కొడుకు రోహిత్(Rohit), మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham), భువనగిరి నాయకుడులు కుంభం అనిల్ కుమార్(Kumbham Anil Kumar), నక్క ప్రభాకర్(Nakka Prabhakar) తదితరులు కాంగ్రెస్ పా(Congress Party)ర్టీ లో చేరారు. మల్లికార్జున్ ఖర్గే వారికి కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే(Manikrao Thacrey), ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి(Vamshi Chand Reddy), మాజీ మంత్రి షబ్బీర్ అలీ(Shabbir Ali), టీపీసీసీ ప్ర‌చార క‌మిటీ కో ఛైర్మ‌న్‌ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) తదితరులు పాల్గొన్నారు.

Updated On 28 Sep 2023 8:49 PM GMT
Yagnik

Yagnik

Next Story