బీఆర్ఎస్ నుంచి మరిన్ని వలసలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీలు

బీఆర్ఎస్ నుంచి మరిన్ని వలసలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీలు సీతారాం నాయక్‌, గోడం నగేశ్‌, హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ నాయకులు లక్ష్మణ్‌, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

“ఈరోజు ఐదుగురు BRS నేతలు బీజేపీలో చేరారు. దశాబ్ద పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని చూసి ముగ్ధులయ్యారు’’ అని తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న కుటుంబ రాజకీయాలు, అవినీతితో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్‌ఎస్‌లో తండ్రి, కొడుకు, కుమార్తె మాత్రమే మిగిలిపోతారని.. ‘బంగారు తెలంగాణ’ బీజేపీతోనే సాధ్యమవుతుందని తరుణ్ చుగ్ అన్నారు.

Updated On 10 March 2024 9:45 AM GMT
Yagnik

Yagnik

Next Story