రాహుల్ జీ.. మరోసారి అక్కడ పర్యటించండి

2023 అసెంబ్లీ ఎన్నికలకు(Assembly Elections) ముందు రాహుల్ గాంధీ(Rahul gandhi) కలిసిన యువకులతో మరోసారి సమావేశమై కాంగ్రెస్ పార్టీ(congress) ప్రభుత్వం ఎలా కొనసాగుతుందో తెలుసుకునేందుకు హైదరాబాద్ అశోక్ నగర్‌లో(Ashok nagar) మరోసారి పర్యటించాలని భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (KTR) కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని.. ఆ హామీ ఎంత వరకూ నెరవేరిందో తెలుసుకోడానికి యువతను కలవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

"Hello @RahulGandhi Ji,

The youth of Telangana had believed your words on “2 lakh govt jobs in 1 year” & voted for Congress

Now after 8 months, the youth is agitating as Zero jobs have been delivered & a “jobless” calendar issued

Why don’t you come back to Ashok Nagar, Hyderabad, meet with the same youngsters and tell them how you will keep your promises?" అంటూ ట్వీట్ పెట్టారు కేటీఆర్. తొమ్మిది నెలల కిందట ఉద్యోగాల పేరిట కాంగ్రెస్ నేతలు డ్రామా చేశారని.. కేసీఆర్‌ అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నట్టు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలని పత్రికల్లో ఊదరగొట్టే విధంగా అక్రమ సంపాదనతో కాంగ్రెస్‌ నాయకులు ప్రకటనలిచ్చారని కేటీఆర్ విమర్శించారు. రాహుల్‌ గాంధీని ప్రామిస్‌ చేసిన రెండు లక్షల ఉద్యోగాలేవీ? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. క్యాలెండర్‌లో తేదీలు మారుతున్నాయని, మరి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఏవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ వాళ్లు బయట కనబడితే నిరుద్యోగులు తన్నితరిమేసే పరిస్థితి ఉందన్నారు.

Eha Tv

Eha Tv

Next Story